Tuesday, May 7, 2024

Kolkata: రూ.6.7 కోట్ల హెరాయిన్ స్వాధీనం

ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారీగా హెరాయిన్ ప‌ట్టుబ‌డింది. ఆ రాష్ట్ర రాజ‌ధాని కోల్‌క‌తాలోని 7 ట్యాంక్స్ లేన్‌లో యాంటీ ఎఫ్ఐసీఎస్ బృందాలు త‌నిఖీలు నిర్వ‌హించాయి. ఈ త‌నిఖీల్లో జార్ఖండ్‌కు చెందిన డ్ర‌గ్ డీల‌ర్ నుంచి భారీగా డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రూ. 6.7 కోట్ల విలువ చేసే 1.341 కిలోల హెరాయిన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ డ్ర‌గ్స్‌ను వాహ‌నంలో దాచి ఉంచిన‌ట్లు పోలీసులు తెలిపారు. అయితే కోల్‌క‌తా పోలీసులు నిందితుడిని ఇవాళ కోర్టు ఎదుట హాజ‌రు ప‌ర‌చ‌నున్న‌ట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement