Wednesday, May 1, 2024

మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.30 కోట్లు ఇవ్వండి … మంత్రి కేటీఆర్ కు దాసరి వినతి

నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం రూ.30 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విన్నవించారు. హైదరాబాదులో మంత్రిని కలిసి పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనుల కోసం 25 కోట్ల రూపాయలు, సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనుల కోసం 5కోట్ల రూపాయలు మొత్తం 30 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ నిధులు మంజూరు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement