Sunday, May 5, 2024

Chhattisghar – పంచాయితీ ఉప స‌ర్పంచ్ గంగ‌ను కిడ్నాప్ చేసిన న‌క్స‌ల్స్ .. ప్ర‌జా కోర్టులో శిక్ష విధించే అవ‌కాశం..

సుక్మా – చ‌తీస్ గ‌డ్ – ‍‍ బుర్కపాల్ పంచాయతీ ఉప సర్పంచ్ మద్వి గంగను నక్సలైట్లు అపహరించారు.. తాడిమెట్లలోని ఇంటి నుంచి నిన్న రాత్రి నక్సలైట్లు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. అపహరణకు గురైన ఉప సర్పంచ్‌పై నక్సలైట్లు నేడు ప్రజాకోర్టును నిర్వహించనున్నారు. దీంతో ఆ గ్రామంలో మ‌ద్వి గంగ ప్రాణాల‌పై ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి..

ఉప సర్పంచ్ మాడ్వి గంగను సురక్షితంగా విడుదల చేసేందుకు పలు సంఘాలు, సామాజిక సంస్థలు ఇప్ప‌టికే రంగంలోకి దిగాయి.. దీనిపై పోలీసులు కూడా అప్ర‌మ‌త్తంగా ఉండి గంగ‌ను విడిపించేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు..మాజీ న‌క్స‌ల్స్, ప్ర‌జా సంఘాల ప్ర‌తినిధుల‌తో అధికారులు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.. ఎటువంటి హాని త‌ల‌పెట్ట‌కుండా గంగ‌ను విడుద‌ల చేయాల‌ని చ‌త్త‌స్ గ‌డ్ ప్ర‌భుత్వం న‌క్సల్స్ కు విజ్ఞ‌ప్తి చేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement