Thursday, May 2, 2024

యశస్వీ,సంజూ శాంసన్ ఔట్ – ఆర్ ఆర్ 94/2

జైపూర్ – ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో జ‌రుగుతున్న మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తొలి వికెట్ కోల్పోయింది.. 44 ప‌రుగులు చేసిన య‌శ‌స్వీ జైశ్వాల్ ను స్టోయినిస్ ఔట్ చేశాడు.. ఆ తర్వాత 2 పరుగులు చేసి సంజూశాంసన్ పెవిలియన్ కు చేరాడు..ప్ర‌స్తుతం ఆర్ ఆర్ 13 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల నష్టానికి 95 ప‌రుగులు చేసింది.. అంతకు ముందు  లక్నో సూపర్ జెయింట్స్ తో జ‌రుగుతున్న మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 155 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది.. జోస్ బ‌ట్ల‌ర్, య‌శ‌స్వీ జైశ్వాల్ లు జాగ్ర‌త్త ఆడుతూ స్కోర్ బోర్డు ను ముందుకు తీసుకెళ్లారు. ఆరు వోవ‌ర్ల‌లో ఈ ఇద్ద‌రూ 47 పరుగులు చేశారు. 12 ఓవర్లో జైశ్వాల్ అవుటయ్యాడు.. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన సంజూ రనౌట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు
కాగా,బౌలింగ్ కు అనుకూల‌మైన పిచ్ మీద ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిర్దారిత 20 ఓవ‌ర్ల‌కు 7 వికెట్ల న‌ష్టానికి 154 ప‌రుగులు చేసింది.. విజ‌యం కోసం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 155 ప‌రుగులు చేయ‌వ‌ల‌సి ఉంది.. ల‌క్నో బ్యాటింగ్ లో మేయ‌ర్స్ 51 ప‌రుగులు చేయ‌గా, రాహుల్ 39, బ‌దోని ఒక ప‌రుగు, దీప‌క్ హుడా 2 , స్టోయినిస్ 21, పూర‌న్ 29, య‌ద్ వీర్ సింగ్ ఒక్క ప‌రుగు చేసి అవుట‌య్యారు.. ఆర్ ఆర్ బౌలింగ్ లో అశ్వీన్ కు రెండు వికెట్లు రాగా, బోల్ట్, సందీప్, హోల్డ‌ర్ కి ఒక్కో వికెట్ ల‌భించింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement