Tuesday, May 7, 2024

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 6 ఓవ‌ర్ల‌కు 47 ప‌రుగులు

జైపూర్ – లక్నో సూపర్ జెయింట్స్ తో జ‌రుగుతున్న మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 155 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది.. జోస్ బ‌ట్ల‌ర్, య‌శ‌స్వీ జైశ్వాల్ లు జాగ్ర‌త్త ఆడుతూ స్కోర్ బోర్డు ను ముందుకు తీసుకెళ్లారు. ఆరు వోవ‌ర్ల‌లో ఈ ఇద్ద‌రూ 47 పరుగులు చేశారు.. జైశ్వాల్ 27, బ‌ట్ల‌ర్ 15 ప‌రుగుల‌తో బ్యాటింగ్ కొన‌సాగిస్తున్నారు.
అంత‌కు ముందు బౌలింగ్ కు అనుకూల‌మైన పిచ్ మీద ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిర్దారిత 20 ఓవ‌ర్ల‌కు 7 వికెట్ల న‌ష్టానికి 154 ప‌రుగులు చేసింది.. విజ‌యం కోసం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 155 ప‌రుగులు చేయ‌వ‌ల‌సి ఉంది.. ల‌క్నో బ్యాటింగ్ లో మేయ‌ర్స్ 51 ప‌రుగులు చేయ‌గా, రాహుల్ 39, బ‌దోని ఒక ప‌రుగు, దీప‌క్ హుడా 2 , స్టోయినిస్ 21, పూర‌న్ 29, య‌ద్ వీర్ సింగ్ ఒక్క ప‌రుగు చేసి అవుట‌య్యారు.. ఆర్ ఆర్ బౌలింగ్ లో అశ్వీన్ కు రెండు వికెట్లు రాగా, బోల్ట్, సందీప్, హోల్డ‌ర్ కి ఒక్కో వికెట్ ల‌భించింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement