Saturday, April 27, 2024

కష్టకాలంలో దేశాన్ని విడిచి వెళ్లిపోతున్న ధనవంతులు

దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో సామాన్యులు నానా అవస్థలూ పడుతున్నారు. అయితే.. దేశంలోని ధనవంతులు మాత్రం పెట్టేబేడా సద్దుకుని ఇతర దేశాల బాట పడుతున్నట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ప్రైవేటు జెట్లను అద్దెకు తీసుకోగలిగిన అనేక మంది అపరకుబేరులు చివరి నిమిషంలో విమానం కావాలంటూ తమ వద్దకు వస్తున్నారని ఢిల్లీలోని ప్రైవేటు జెట్ల సంస్థ నిర్వాహకుడు ఒకరు వ్యాఖ్యానించారు.

కరోనా కారణంగా బెంబేలెత్తిపోతున్న వారందరూ దేశం విడిచి వెళ్లేందుకు లక్షల రూపాయలు కర్చు పెట్టేందుకు వెనకాడట్లేదని సదరు నిర్వాహకుడు వ్యాఖ్యానించారు. దేశంలోని పరిస్థితి సద్దుమణిగేంత వరకూ బ్రిటన్, యూఏఈ వంటి దేశాల్లో కాలం గడపాలనేది వీరి ప్లాన్. అపర కుబేరులే కాదు.. కాస్తంత సంపద ఉండి ప్రైవేటు విమానాలను అద్దెకు తీసుకోగలిగిన అనేక మంది అప్పటికప్పుడు విమానాలు బుక్ చేసుకుని దేశం దాటేస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement