Friday, April 26, 2024

ఆప‌ద‌లో ఉన్నప్పుడు ఆదుకున్న టిఆర్ ఎస్ పార్టీకే ఓటేయండి – మంత్రి స‌త్య‌వ‌తి..

వ‌రంగ‌ల్ : ఎన్నికలు రాగానే ఓట్లకోసం అన్ని పార్టీల వాళ్ళు వస్తార‌ని,. కానీ ఎవరికీ ఓటు వేస్తే మన జీవితాలు బాగుపడతాయనేది ఓటేసే ముందు ఆలోచించాలి అని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఓట‌ర్ల‌ను కోరారు.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా 2వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కల్పనా బానోత్‌కు మద్దతుగా మంత్రి సత్యవతి రాథోడ్‌, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, స్థానిక టీఆర్ఎస్ పార్టీ నేతలు కలిసి ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ మాట్లాడుతూ.. 2వ డివిజ‌న్ అభ్య‌ర్థి క‌ల్ప‌నా బానోత్‌ను నిండు మ‌న‌సుతో ఆశీర్వ‌దించి, భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కోరారు. పేద‌ల సంక్షేమం టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. ఈ వరంగల్ నగరమంటే సీఎం కేసీఆర్‌కు అత్యంత ప్రేమ ఉండడం వ‌ల్లే ఈ నగర అభివృద్ధికి నేరుగా బడ్జెట్‌లో ఏటా రూ. 300 కోట్లు ఖ‌ర్చుపెట్టి అభివృద్ధి చేస్తున్నారు అని స్ప‌ష్టం చేశారు. రూ. 1600 కోట్లతో మిషన్ భగీరథ ప్రారంభించి ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నారు అని తెలిపారు. మనకు వరదలు వచ్చినపుడు, కరోనా వచ్చినపుడు ప్రజలను పట్టించుకోని బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలి అని మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement