Friday, May 3, 2024

ఢీల్లీ వాసులు మాస్క్ ధ‌రించాల్సిందే…

ఢిల్లీలో మళ్లీ మాస్క్ ల ధారణ విధానం అమల్లోకి వచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు ధరించడం తప్పనిసరి అంటూ ఢిల్లీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఉల్లంఘిస్తే రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వ్యక్తిగత కార్లు, వ్యాన్లలో ప్రయాణించే వారికి ఈ నిబంధన వర్తించదని సర్కారు స్పష్టం చేసింది. దేశ రాజధానిలో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. ఇది అక్కడి అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం ఢిల్లీలో 2,146 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. పాజిటివిటీ రేటు 17.83 శాతానికి పెరిగింది. ఎనిమిది మంది మరణించారు. ఆరు నెలల్లోనే ఇదే అత్యధికం.

Advertisement

తాజా వార్తలు

Advertisement