Friday, April 26, 2024

బ్లాక్ మార్కెట్‌లో రెమిడెసివిర్ అమ్మకాలు.. ఏడుగురి అరెస్ట్

కరోనా రోగులకు ఇవ్వాల్సిన రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠాను అనంతపురం వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నర్సులు, ముగ్గురు జిల్లా సర్వజన ఆసుపత్రి పొరుగు సేవల ఉద్యోగులు ఉన్నారు. వీరి నుంచి 14 రెమ్‌డెసివిర్‌ సూది మందును, రూ.94 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నర్సులు సుకన్య, భారతి, సర్వజన ఆసుపత్రి పొరుగు సేవల ఉద్యోగులు రాజేష్‌, నరేంద్ర, కిశోర్‌నాయుడుతో పాటు విశ్వనాథరెడ్డి (రామచంద్రనగర్‌), సత్యనారాయణ (మాలవాండ్లపల్లి, నార్పల) ఉన్నట్లు సీఐ ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు.

నిందితుల నేపథ్యం ఇదీ
సర్వజన ఆసుపత్రిలో పొరుగు సేవల ఉద్యోగుల రాజేష్‌, నరేంద్ర, కిశోర్‌నాయుడుతో పాటు ప్రైవేటు మెడికల్‌ మార్కెటింగ్‌ విభాగంలో పని చేస్తున్నారు. వీరందరూ కలిసి రెమ్‌డెసివిర్‌ అక్రమ వ్యాపారానికి తెరలేపారు. సర్వజన ఆసుపత్రిలో చేరిన కరోనా రోగులకు అవసరాన్ని బట్టి ఇంజక్షన్లు వాడుతున్నారు. ఈ క్రమంలో వాటిని దారి మళ్లిస్తున్నారు. సగం ఇంజక్షన్లు రోగులకు ఎక్కించి మిగిలిన మందును నర్సులు ఈ ముఠా సభ్యులకు విక్రయించారు. ఒక్కో సూది మందు రూ.16 వేలకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకుని నిందితులను కోర్టులో హాజరుపరిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement