Thursday, May 9, 2024

RBI | నోట్ల మాయంపై ఆర్బీఐ వివరణ

వేల కోట్ల విలువైన 500 రూపాయల నోట్లు లెక్కల్లో కనిపించంలేదని వచ్చిన వార్తలను ఆర్బీఐ తోసిపుచ్చింది. ప్రింటింగ్‌ నుంచి నోట్లన్నింటీని ఆర్బీఐ సరిగానే లెక్కించిందని తెలిపింది. 88,032.5 కోట్ల విలువైన 500 రూపాయల నోట్లు లెక్కల్లో కనిపించడంలేదని వార్తలు వచ్చాయి. సమాచార హక్కు చట్టం కింద సేకరించిన వివరాలను ఒక ఆర్టీఐ కార్యకర్త మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు. మూడు నోట్స్‌ ప్రిటింగ్‌ ప్రెస్‌ల నుంచి 375.45 మిలియన్ల 500 నోట్లు ప్రింట్‌ చేసినట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైందని, ఆర్బీఐ మాత్రం 345 మిలియన్‌ నోట్లు మాత్రమే వచ్చినట్లు తెలిపినట్లు ఆర్టీఐ కార్యకర్త తెలిపారు.

- Advertisement -

ప్రింటింగ్‌ నుంచి వచ్చిన అన్ని నోట్లు సక్రమంగా లెక్కించి, రికార్డ్‌ చేసినట్లు తెలిపింది. నోట్ల ప్రింటింగ్‌ నుంచి ఆర్బీఐకు సరఫరా చేసే వరకు అన్నో దశల తనిఖీలు, ప్రోటోకాల్స్‌, కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. నోట్ల నిల్వ, పంపిణీకి నియంత్రణకు ప్రోటోకాల్స్‌ ఉన్నాయని తెలిపింది. ఆర్బీఐ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు ప్రచురిస్తున్న సమాచారాన్ని విశ్వసించాలని ఆర్బీఐ కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement