Saturday, May 4, 2024

అవార్డు వ‌స్తే అన్ని విప్పేస్తాం..చూసుకోండి

ముంబై వేదికగా జరిగిన జీ అవార్డుల వేడుకలో రష్మిక మందన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కన్నడనాట పుట్టి, తెలుగులో స్టార్‌డమ్‌ సొంతం చేసుకుని, తమిళ సినిమాల్లో సైతం నటిస్తున్న ఈ భామ ఇప్పటికే బాలీవుడ్‌పై దృష్టిపెట్టింది. బిగ్‌ బి అమితాబ్‌తో కలిసి గుడ్‌ బై చిత్రంలో నటించింది. ఈ సినిమా ద్వారానే బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. అందుకే ఆమెకు ఉత్తమ నూతన నటిగా ఆమెకు పురస్కారం దక్కింది.


అవార్డు స్వీకరణ కోసం రష్మిక ప్రత్యేకంగా ముస్తాబైంది. ఆమెవైపు ఆహుతుల దృష్టి నిలిచింది. బ్లాక్‌ అవుట్‌ ఫిట్‌తో రష్మిక హాజరైంది. కురచ దుస్తుల్లో హోయలు పోతూ ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా, ఆమె వేసుకున్న డ్ర‌స్ పై సోష‌ల్ మీడియాలో నెగిటీవ్ కామెంట్స్ ట్రోల్ అవుతున్నాయి.. పొట్టి డ్ర‌స్ లతో అందాన్ని బాలీవుడ్ వేదిక‌పై ఆర‌బోసి ద‌క్షిణాది ప‌రువు తీసేసిందంట ఏకీ పారేస్తున్నారు.. ఇంత ఇలా ప‌రువాలు చూపాలా అంటూ ర‌ష్మిక‌కు క్లాస్ పీకుతున్నారు.. అయితే వాటిని పట్టించుకోకుండా తన ఇన్‌స్టాలో వీటిని షేర్‌ చేసిన రష్మిక ” ఇది చాలా ప్రత్యేకమైన రోజు. నా అభినయానికి అవార్డు రావడం గౌరవంగా భావిస్తున్నాను” అని పేర్కొంది. రష్మిక హిందీ చిత్రాల్లో బిజీగా ఉంది. ముఖ్యంగా పుష్ప సినిమాలో ఆమె పోషించిన శ్రీవల్లి పాత్ర దేశవ్యాప్తంగా సినీ అభిమానులకు దగ్గర చేసింది. ఈ సినిమా సీక్వెల్లో నటిస్తోంది. ఇంకా హిందీ సినిమా యానిమల్‌లో రణబీర్‌ కపూర్‌తో కలిసి నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement