Tuesday, March 26, 2024

ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే. గ్రూప్‌-1 మెయిన్స్‌, గ్రూప్-4 పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ఖరారు చేసింది. జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు, జులై 1న గ్రూప్-4 పరీక్షలు జరగనున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement