Monday, April 29, 2024

భ‌ర్త‌పై పోలీసుల‌కి ఫిర్యాదు చేసిన.. రాఖీసావంత్

త‌న అమ్మ మ‌ర‌ణానికి కార‌ణం త‌న భ‌ర్త ఆదిల్ ఖాన్ అని ఆరోపించింది బాలీవుడ్ న‌టి రాఖీ సావంత్.కాగా ఆమె ముంబై పోలీసులు భర్త ఆదిల్ ఖాన్ పై ఫిర్యాదు చేయ‌గా అత‌నిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిల్ తన నిధులను దుర్వినియోగం చేశాడంటూ ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను గతేడాది మరాఠీలో బిగ్ బాస్ లో పాల్గొంటున్న సమయంలో అనారోగ్యంతో ఉన్న తన అమ్మ జయా జశ్వంత్ ఆరోగ్యం చూసుకోవాలని కోరినట్టు ఆమె పేర్కొంది. అయినప్పటికీ అమ్మ సర్జరీకి సకాలంలో డబ్బులు ఆదిల్ చెల్లించలేదని, ఆమె మరణానికి అతడే కారణమని ఆరోపించింది. ఆదిల్ ఖాన్ అరెస్ట్ ను రాఖీ సావంత్ మంగళవారం ప్రకటించింది. తనను కలిసేందుకు ఇంటికి వచ్చిన అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపింది. ఇది డ్రామా కాదు. అతడు నా జీవితాన్ని నాశనం చేశాడు. నన్ను కొట్టి నా డబ్బులు దోచుకెళ్లాడని చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement