Sunday, May 5, 2024

IPL | 32 పరుగుల తేడాతో చెన్నైపై రాజస్తాన్ గెలుపు..

ఐపీఎల్ 2023లో సంజూ సాంసన్ కప్టెన్సీ వహిస్తున్న రాజస్తాన్ రాయల్స్ మరో భారీ విజయాన్ని నమోదు చేసింది. చెన్నై సూపన్ కింగ్స్ తో జైపూర్ వేదికగా ఇవ్వాల (గురువారం) రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్.. ఆ తర్వాత బౌలింగ్‌ చెలరేగిపోయిన రాజస్తాన్ 32 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 202 పరుగులు చేయగా.. ఛేదనలో చెన్నై 6 వికేట్ల నష్టానికి 170 పరుగులకే పరిమితమైంది.

మ్యాచ్‌లో అంతకముందు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఆ జట్టులో జైస్వాల్ 77 పరుగులు, జురెల్ 34 పరుగులు, జాస్ బట్లర్ 27 పరుగులు చేశారు. జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్ తో రాజస్థాన్ స్కోరు భారీగా వెళ్లింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement