Monday, April 29, 2024

Rajasthan – వంతెన పై నుంచి రైల్వే ట్రాక్‌ పై పడిన బస్సు – నలుగురు మృతి

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వంతెన పైనుండి వెళుతున్న బస్సు అదుపుతప్పి పై నుండి రైల్వే ట్రాక్‌ పై పడింది. ఈ దుర్ఘటన దౌస జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సర్కిల్‌ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి అధికారులు చేరుకున్నారు. గాయపడినవారందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

.వీరిలో తీవ్రంగా గాయపడిన 28 మందిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందినట్లు వెల్లడించారు. మిగిలిన క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతున్నట్లు వివరించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ రాజ్‌కుమార్‌ కస్వా తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Advertisement

తాజా వార్తలు

Advertisement