Friday, April 26, 2024

Rain Alert : ఏపీకి వర్ష సూచన.. రానున్న మూడు రోజుల్లో వానలు..!

ఏపీలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం దుందని తెలిపింది. పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తర తమిళనాడు తీరంలో సగటు- సముద్రంపై 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీ మధ్యఉండి కొనసాగుతున్నది. బంగాళాఖాతం మీదుగా దిగువ ట్రోపోస్పిరిక్‌ స్థాయిలలో ఈశాన్య గాలులు ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ ఇంటీ-రియర్‌ కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి సముద్ర మట్టానికి సగటు- 0.9 కి మీ ఎత్తు వద్ద ఉన్నది ఇపుడు బలహీన పడినది. ఈ నేపథ్యంలో ఏపీలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు చేసింది. పూర్తి దక్షిణ ద్వీపకల్ప భారతదేశం అంతటా ఈశాన్య రుతుపవనాల ప్రభావం వలన దాదాపు 29 అక్టోబర్‌, 2022 నుండి ఆగ్నేయ ద్వీపకల్ప భారతదేశం నందు వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement