Sunday, April 28, 2024

Rahul Gandhi: మ‌హాత్మాగాంధీ వ‌ర్ధంతి…ఘ‌నంగా నివాళుల‌ర్పించిన రాహుల్ గాంధీ

ప‌శ్చిమ బెంగాల్ – జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ క్యాంప్ సైట్‌లో ఆయనకు నివాళి అర్పించారు. ప‌శ్చిమ బెంగాల్ ఉద్ద‌మ్ పూర్ లో బ‌స చేసిన రాహుల్ నేటి ఉద‌యం గాంధీజీ చిత్ర ప‌టానికి పూల మాల‌లు వేసి అంజ‌లి ఘ‌టించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఈ మహా న్యాయ యాత్ర గాంధీజీ ఆలోచనల నుంచి ప్రేర‌ణ పొందాన‌ని అన్నారు. దేశంలో ఎవ‌రు గాంధీజీ భావజాలాన్ని అణిచివేసేందుకు ఎవరు ప్రయత్నించినా దానిని అధిగమించి బాపూజీ సిద్ధాంతాలను, ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామ‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement