Sunday, May 5, 2024

ఎంపీ గోరంట్ల మాధవ్‌పై స్పీకర్‌కు రఘురామ ఫిర్యాదు

వైసీపీ ఎంపీలకు నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వరుసగా ఝలక్ ఇస్తున్నారు. ఇప్పటివరకు సీఎం జగన్, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలపై ఆరోపణలు చేసిన ఆయన.. తాజాగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఆవరణలోనే గోరంట్ల మాధవ్ తనను బెదిరిస్తున్నాడని స్పీకర్ ఓం బిర్లాకు రఘురామ ఫిర్యాదు చేశారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా మీడియా సమావేశాలు పెడితే తన అంతు చూస్తానని బెదిరించినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేకాకుండా సెంట్రల్ హాలులో ఇతర ఎంపీల ముందు తనతో గోరంట్ల మాధవ్ నీచంగా మాట్లాడినట్లు రఘురామ ఆరోపించారు. ఆ సమయంలో ఇతర ఎంపీలు ఉండటంతో తాను సంయమనం పాటించినట్లు తెలిపారు. అనంతరం లోక్‌సభ స్పీకర్‌కు ఈ అంశంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని వివరించారు. గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన విజువల్స్ సెంట్రల్ హాలులోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని ఆయన చెప్పారు. తన ఫిర్యాదు పట్ల స్పీకర్ సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం ఉందన్నారు.

ఈ వార్త కూడా చదవండి: మహిళా లోకానికి ఇది చీకటి రోజు

Advertisement

తాజా వార్తలు

Advertisement