Monday, May 6, 2024

సింధూ సెమీస్ లో కూడా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది: పీవీ రమణ హర్షం

టోక్యో ఒలింపిక్స్‌ లో సెమీస్ చేరిన పీవీ సింధుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. క్వార్టర్ ఫైనల్ లో జపాన్ ప్లేయర్ యమగూచిపై సింధు అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. సింధూ విజయం పట్ల ఆమే తండ్రి పీవీ రమణ స్పందించాడు. యమగూచిపై పీవీ సింధు విజయం అనంతరం ఆయన హైదరాబాద్‌లోని స్వగృహంలో మాట్లాడుతూ.. ఇవాళ జరిగినక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సింధు ఒత్తిడిని జయించి విజయం సాధించిందని అన్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచి ప్రత్యర్ధిపై సింధు చాలా బాగా ఆడిందని పేర్కొన్నారు. తన కూతురి విజయంలో కోచ్‌ సహా అందరి సమష్టి కృషి ఉందని రమణ తెలిపారు. సింధు దేశానికి మంచి పేరు తెస్తున్నందుకు ఆనంద పడుతున్నాని ఆనందం వ్యక్తం చేశారు. సెమీస్ లో కూడా ఇదే ఆటతీరుతో విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: ఈటలకు ధీటైన టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు?

Advertisement

తాజా వార్తలు

Advertisement