Friday, April 26, 2024

తెలంగాణ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో మాజీ ప్రధాని పీవీ వ‌ర్ధంతి

భార‌త మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు 17వ వ‌ర్ధంతి సంస్మ‌ర‌ణ స‌భ‌ను తెలంగాణ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నున్నారు. రేపు(డిసెంబర్ 23) పీవీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞాన‌భూమి వద్ద నివాళుల‌ర్పించ‌నున్నారు. ఉద‌యం 9 గంట‌ల‌కు పుష్పాంజ‌లి ఘ‌టించ‌నున్నారు.

మరోవైపు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పీవీ దేశానికి అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా శత జయంతి ఉత్సవాలను ఏడాది కాలంగా తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement