Thursday, April 25, 2024

ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప‌నిచేస్తున్న సీఎం కేసీఆర్ : మ‌ల్లారెడ్డి

రాష్ట్ర ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామ‌కూర‌ మ‌ల్లారెడ్డి తెలిపారు. క్రిస్మస్‌ సందర్భంగా ప్రభుత్వం క్రిష్టియన్‌ సోదరులకు అందజేస్తున్న దుస్తులను మంత్రి ఈరోజు ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీలలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్‌ ఆదరించి అభివృద్ది పరుస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ శాంసన్‌ చైర్మన్లు ఎం.పావని‌, బి.కొండల్‌రెడ్డి, కౌన్సిలర్లు టీతదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement