Saturday, April 27, 2024

RCB vs PBKS | ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్.. ఆర్సీబీ ముందు పోరాడే ల‌క్ష్యం

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఇవ్వాల జ‌రుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు ఆర్సీబీ ముందు ఊరించే టార్గెట్‌ను సెట్ చేసింది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.

పంజాబ్ కెప్టెన్ శికర్ ధవన్ (45) పరుగులతో ఆటక్టుకోగా.. ప్రభసిమ్రాన్ సింగ్ (25), సామ్ కర్రాన్ (23), జితేష్ శర్మ (27) ప‌రుగులు చేసి వెనుదిరిగారు. ఇక, ఆక‌ర్లో శశాంక్ సింగ్ (నాటౌట్) 8 బంతుల్లో 21 ప‌రుగులు చేయడంతో ఆర్సీబీ ముందు పోరాడే ల‌క్ష్యాన్ని నిర్దేశించగలిగారు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్, గ్లెన్ మాక్స్ వెల్ రెండేసి వికెట్లు తీయగా… యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్ ఒక్కో వికెట్ తీశారు. కాగా, 177 ప‌రుగుల టార్గెట్ తో ఆర్సీబీ బ‌రిలోకి దిగ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement