Sunday, May 5, 2024

మ‌ద్యం ధ‌ర‌ల‌ను – భారీగా త‌గ్గించిన పంజాబ్ స‌ర్కార్

మ‌ద్యం ధ‌ర‌ల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌నుంది పంజాబ్ స‌ర్కార్. స‌రికొత్త ఎక్సైజ్ విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా మద్యం ప్రియులతో ఫరీద్ కోట్ ఆప్ ఎమ్మెల్యే గుర్దిత్ సింగ్ మాట్లాడుతూ… వీలైతే మద్యం మానేసేందుకు ప్రయత్నించాలని కోరారు. మందు మానలేని పరిస్థితిలో ఉంటే… తక్కువగా తాగడాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించడం వల్ల మిగిలే డబ్బును ఇంటి అవసరాల కోసం వినియోగించాలని సూచించారు. ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయాలని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement