Thursday, April 25, 2024

Hyd: కాంగ్రెస్ నిరసన ర్యాలీకి పోలీసుల అనుమతి

హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. దీంతో ఈడీ ఎదుట రాహుల్ ఈరోజు హాజరుకానున్నారు. ఈడీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్.. నేడు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించనున్న నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement