Saturday, May 4, 2024

NZB: ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలి.. మంత్రి వేముల

ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లాలోనిశ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పర్యటనలో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలోని వన్నెల్ బి.బోధపల్లి, బాల్కొండ గ్రామాల మీదుగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రోడ్డుమార్గం ద్వారా వాహనంలో ప్రయాణిస్తున్న సందర్భంగా ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ.. గత వారం రోజుల నుండి భారీగా కురుస్తున్న వర్షాలను గ్రామంలో సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

వర్షానికి కూలిపోయి ప్రమాదకరమైన నివాసంలో నివసిస్తున్న అటువంటి వారిని గుర్తించి ఆవాస ప్రాంతాలకు తరలించాలన్నారు. మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement