Sunday, May 19, 2024

Kavitha | కవిత కోరినవి ఇవ్వాలి.. కోర్ట్ ఆదేశం

తిహాద్ జైలులో బీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి జైలు అధికారులను ఆదేశించింది. కొన్ని వస్తువులను స్వయంగా సమకూర్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. జపమాల, పుస్తకాలు, పెన్నులు, ఇతర వస్తువులతో పాటు మెడిటేషన్‌ చేసుకునేందుకు, ఇంటి నుంచి ఆహారం, పరుపు, దుప్పట్లు తెచ్చుకునేందుకు, ఆభరణాలు ధరించేందుకు, లేసులు లేని బూట్లుకు అనుమతించాలని న్యాయస్థానం ఆదేశించింది.

మార్చి 26న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏ ఒక్కటీ అనుమతించలేదని కవిత తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్నింటినీ తెచ్చుకునేందుకు అనుమతించినట్లు జైలు సూపరింటెండెంట్‌ న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి స్పష్టంగా లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement