Tuesday, May 7, 2024

తిరుప‌తిని స‌ర్వ‌నాశ‌నం చేసిన వైసీపీ-చంద్ర‌బాబు మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తారు-నిర్మాత అశ్వ‌నీద‌త్

ఈ మూడు సంవ‌త్స‌రాల్లో తిరుప‌త‌ని ఏపీ ప్ర‌భుత్వం స‌ర్వ‌నాశ‌నం చేసింద‌ని మండిప‌డ్డారు సినీ నిర్మాత అశ్వ‌నీద‌త్. ఆయ‌న . నిర్మించిన ‘సీతారామం’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో అశ్వనీదత్ మాట్లాడారు. తిరుపతిలో జరిగే అన్యాయాలను ఊహింలేమని, ఇప్పుడు అక్కడ జరగని పాపం లేదని అశ్వనీదత్ అన్నారు. స్వామి ఇంకా ఆ పాపాలను ఎందుకు చూస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. గతంలో తిరుపతిలో ఆగమ శాస్త్రం ప్రకారం వెయ్యికాళ్ల మండపాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలగించారన్నారు.

కానీ ఆ విషయంలో నాడు చినజీయర్ స్వామి.. చంద్రబాబును తీవ్రంగా విమర్శించారని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం చినజీయర్ స్వామి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో బలవంతపు మత మార్పిడిలు జరుగుతుంటే ఆయన ఎందుకు మాట్లాడటం లేదన్నారు. చినజీయర్ ఆ మధ్య జగన్ ను దైవాంశ సంభూతుడని పొగిడిన మాటలు వినగానే తన కడుపు మండిపోయిందని అశ్వనీదత్ తెలిపారు. సమ్మక్క- సారక్కను చినజీయర్ దేవతలు కాదనడం తనకు బాధ కలిగించిందన్నారు. సమ్మక్క-సారక్క అంటే తెలంగాణ ప్రజల్లో ఎంతో విశ్వాసం ఉందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో సమ్మక్క- సారక్కను దేవతలుగా నమ్ముతారన్నారు.చంద్ర‌బాబునాయుడు మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తార‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement