Friday, April 26, 2024

విషాదం.. మొన్న భర్త.. ఇవాళ భార్య ఆత్మహత్య

నల్గొండ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న ప్రైవేట్ టీచర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆర్థిక సమస్యలతో రెండు రోజుల క్రితం నాగార్జున సాగర్‌లో ప్రైవేట్ టీచర్ రవి ఆత్మహత్య చేసుకోగా.. గురువారం నాడు రవి భార్య అక్కమ్మ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు.

నాగార్జునసాగర్‌కు చెందిన రవికుమార్ ప్రైవేట్ టీచర్‌గా పనిచేసేవారు. కరోనా వల్ల ఏడాది నుంచి జీతాలు రాక, ఆర్థికసమస్యలు పెరిగాయి. దంపతుల మధ్య గొడవలయ్యాయి. భార్య అక్కమ్మ ఇల్లు వదిలిపోయింది. మనస్తాపంతో మొన్న రవి ఆత్మహత్య చేసుకోగా, ఇవాళ అక్కమ్మ సాగర్ కుడి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆత్మహత్యలు జరగకుండా భరోసా కల్పించాలని ప్రైవేట్ టీచర్లు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement