Wednesday, April 24, 2024

నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే..

సిద్దిపేట : రాష్ట్రంలో జరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలేనని దీనికి ప్రభుమే పూర్తి బాధ్యత వహించాలని రెవల్యూషనరి సోషలిస్టు పార్టీ ఉమ్మడి మెదక్‌ జిల్లా కన్వీనర్‌ మన్నె కుమార్‌ ఎఐపియస్‌యు సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఓగ్గు రమేష్‌లు డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ట్ర ఏర్పాటు జరిగితే మన నీళ్లు నిధులు నియామకాలు మనవే అన్న అంశాలపై కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒకరి కుటుంబంకి మాత్రమే పరిమితమయ్యాయని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర కోసం జరిగిన విధ్యార్థుల ఆత్మ బలిదానాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక కూడా కోనసాగుతూనే ఉన్నాయి. ఆవేదన వ్యక్తం చేశారు దీనంతటికి రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలే కారణమని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు కోసం ఎవరు అడగలేదు ఉద్యమాలు చేయలేదని కానీ కేవలం ప్రభుత్వం తన స్వార్ధ ప్రయోజనాల కోస మే ఈ నిర్ణయాన్ని తీసుకుందని వారు అన్నారు. దీని మూలంగా ఉన్నత చదువులు పూర్తి చేసుకుని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఎన్నో ఆశలతో ఉన్న నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమయ్యారని వారు తెలిపారు. కావున ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ వైఖరిని ప్రకటించాలని వారు సూచించారు. లేని పక్షంలొ ఆర్‌యస్‌పి పార్టీ ప్రజాసంఘాలైన ఎఐపియస్‌యు ఆర్‌వైఎఫ్‌ మరియు ఇతర ప్రజా సంఘాల ఆద్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనలు చేపడుతామని వారు హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో ఎఐపియస్‌యు జిల్లా ఉపాధ్యాక్షుడు ధర్మాజీ, నిరజ్‌, రమేష్‌, వర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement