Saturday, May 4, 2024

సిక్కింలో రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము పర్యట‌న.. స్టేజీపై నృత్యం..

అత్యంత సుందరమైన రాష్ట్రాలలో సిక్కిం ఒకటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం రాష్ట్రపతి గ్యాంగ్ టక్ చేరుకోగా రాష్ట్ర గవర్నర్ గంగా ప్రసాద్ ఘ‌న‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ భార్య కృష్ణా రాయ్ తో కలిసి రాష్ట్రపతి ముర్ము స్టేజిపై నృత్యం చేశారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంచుకొండ‌ల అందాలు ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయ‌ని తెలిపారు. వివిధ సంస్కృతి కార్య‌క్ర‌మాలు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement