Monday, April 29, 2024

తిరుమలలో భక్తుల కొండంత రద్దీ..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి ద‌ర్శ‌నానికి తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. శ్రీ‌వారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భ‌క్తులు వేచియున్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుమ‌ల‌లో శ్రీ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 63,670 మంది భక్తులుదర్శించుకోగా 30,475 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.79 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement