Tuesday, April 30, 2024

Prashant Kishor: 2024లో బీజేపీని ఓడించడం సాధ్యమే.. కానీ..

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించి ఇంటికి పంపడం సాధ్యమేనని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు అనుకూలంగా రాకపోయినా సరే 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడం సాధ్యమయ్యే పనేనని విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకు తగిన ప్రతిపక్షం ఏర్పాటుకు తాను సహాయపడతానని అన్నారు. ఇప్పుడున్న ప్రతిపక్షంతో మాత్రం బీజేపీని ఓడించలేమని చెప్పారు. హిందుత్వ నినాదం, జాతీయభావానికితోడు సంక్షేమ పథకాలతో బీజేపీ ఎన్నికలకు వెళ్తోందన్నారు. వీటిలో రెండింటిని అయినా  ప్రతిపక్షాలు అధిగమించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ లేకుండా బలమైన ప్రతిపక్షం సాధ్యం కాదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. బీజేపీని ఓడించేందుకు తగిన ప్రతిపక్షం ఏర్పాటులో తాను సాయపడతానన్నారు. కాంగ్రెస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేస్తే తప్ప బీజేపీని ఓడించడం సాధ్యం కాదన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement