Sunday, April 28, 2024

ఢీ షోకి ముఖ్య అతిథిగా ప్ర‌భుదేవా.. సొంత ఇంటికి వచ్చినట్లుందన్న కొరియోగ్రాఫర్

టీవీ షోల‌లో హిట్ గా నిలిచింది ఢీ షో. ఈ షో ద్వారా ఎంతో మంది డాన్సర్లు వెలుగులోకి వ‌చ్చారు. తద్వారా సినిమాలకు పనిచేసే అవకాశం దక్కించుకుంటున్నారు. ప్రతిభావంతులకు ‘ఢీ ‘మంచి వేదికగా నిలిచింది. ఇప్పటికే 14 సీజన్లను దిగ్విజయంగా ముగించుకుని 15వ సీజన్ లోకి అడుగు పెట్టింది. ఎంతో గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకకు ఇండియన్ మైఖెల్ జాక్సన్…దర్శకుడు..నటుడు ప్రభుదేవా ముఖ్య అథిదిగా విచ్చేసారు. ఈ సందర్భంగా కంటెస్టెంట్లు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వ్యాఖ్యాత ప్రదీప్ చెప్పినట్లు ఇంటి పెద్దన్నయ్య విదేశాలు అన్ని తిరిగి నాకు నిజంగానే సొంత ఇంటికి చేరుకున్నట్లే అనిపిస్తుంది.

నా పొలంలో మొలకలు వచ్చినట్లు అనిపిస్తుంది. ఢీ’ షోలో డాన్సర్లు అందరూ చాలా బాగా చేస్తున్నారు. వాళ్లని చూస్తుంటే నాకు కూడా పోటీ దారుడిగా మారిపోవాలని ఉంది. కానీ మొదటి రౌండ్లో నేను ఓడిపోతాను అని నాకు తెలుసు. మీరంతా చాలా డెంజరస్ డాన్సర్లు. మీతో నేను పోటీ పడలేను. నేను ముందే వచ్చేశాను. అందుకే ఇక్కడ కూర్చోబెట్టారు. నా తర్వాతే మీరంతా పుట్టినందకు థాంక్స్’ అంటూ ఆసక్తికరంగా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు పోటీదారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ప్రభుదేవా నిరాడంబరతని చూసి డాన్సర్లు అంతా షాక్ అయ్యారు. ఆయన అంత పెద్ద డాన్సర్..దర్శకుడు ఎలాంటి తారతమ్యం లేకుండా తమతో పాటే సమానంగా భావించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement