Sunday, April 28, 2024

Followup: సానుకూలంగా సూచీలు.. స్వల్ప లాభాల్లో మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నష్టాల్లోకి జారుకునే దశ నుంచి పుంజుకుని లాభాల్లో నిలబడి సెంటిమెంట్‌ను పాజిటివ్‌గా ఉంచాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం సానుకూలం కాగా, రూపీ విలువ మరోసారి జీవితకాల కనిష్టానికి పతనం కావడం దేశీయ స్టాక్‌మార్కెట్లకు ప్రతికూలంగా మారింది. ఉదయం సెన్సెక్స్‌ 59,196 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది.

ఇంట్రాడేలో 59,399- 58,61 పాయింట్ల మధ్య కనిష్ట, గరిష్టాలను తాకింది. చివరకు 146 పాయింట్ల లాభంతో 59,107వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 17స512 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.91 వద్ద కొనసాగింది. రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, నెస్లే, ఐటీసీ లాభాలను నమోదు చేశాయి. ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ సర్వీస్‌, కోల్‌ ఇండియా నష్టాల్లో కొనసాగాయి. మరో వైపు ఆసియా మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి. ఎస్‌జీఎక్స్‌ నిప్టీ, నిక్కీ లాభాల్లో కొనసాగగా.. స్ట్రెయిట్‌ టైమ్స్‌, హాంగ్‌సెంగ్‌ నష్టాల్లో కొనసాగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement