Thursday, March 28, 2024

మునుగోడులో జోరుగా మంత్రి పువ్వాడ ప్రచారం.. బోనాలు, బతుకమ్మలతో స్వాగతించిన మహిళలు

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి కొరటికల్ గ్రామంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయాన్ని కోరుతూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ కు స్థానిక మహిళలు బోనాలు, బతుకమ్మలు, కోలాటం ఆటపాటలతో ఘన స్వాగతం పలికారు. ఇంటికి ప్రచార నిమిత్తం ఓటు అభ్యర్ధన కొరకు వచ్చిన మంత్రి నుదుట కుంకుమ దిద్ది మహిళలు హారతి పట్టారు. డప్పు కళాకారుల డప్పుల దరువులు, బ్యాండ్‌ వాయిద్యాలు, పటాకుల మెరుపులు, యువకుల కేరింతల నడుమ విస్తృతంగా ప్రచారం సాగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement