Thursday, May 9, 2024

నిండు ప్రాణాన్ని కాపాడిన గోవా పోలీస్..వీడియో వైరల్

రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయి ప్రయాణికుడు జారిపడ్డ ఘటన గోవాలో జరిగింది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు అదుపు తప్పి ట్రైన్ ప్లాట్ ఫామ్ కింద పడ్డాడు. అయితే ఇది గమనించి రైల్వే పోలీస్ అధికారి క్షణాల్లో స్పందించాడు. వెంటనే అతన్ని రక్షించాడు.. ట్‌ఫామ్ నుంచి కిందకు జారిపోతున్న అతన్ని వెంటనే బయటకు లాగి.. పక్కకు తీసుకెళ్లాడు. దీంతో అతని ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఈ ఘటనలో ఆ ప్రయాణికుడికి గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ వీడియో షేర్ చేసిన రైల్వే మంత్రిత్వ శాఖ.. కదులుతున్న రైలు ఎక్కడం గానీ, దిగడం గానీ చేయకూడదని ప్రయాణికులను కోరింది. అది జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టవచ్చని పేర్కొంది. గోవాలోని వాస్కోడి గామా రైల్వే స్టేషన్ లో జరిగింది ఈ ఘటన.

Advertisement

తాజా వార్తలు

Advertisement