నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకున్న వేళ గట్టుప్పల్ శివారులో రూ.19 లక్షలు నగదు పోలీసులు పట్టుకున్నారు. గట్టుప్పల్ నుంచి పుట్టపాక వెళ్ళే దారిలో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. బ్రీజా కారులో తరలిస్తున్న రూ.19 లక్షలు పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎవరు ఇచ్చారు? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కారులో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ లభ్యమైనట్లు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement