Friday, May 3, 2024

TS | గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం.. విక్ర‌యిస్తున్న‌ ఇద్దరి అరెస్ట్

గణపురం (ప్రభన్యూస్): జయశంకర్ జిల్లా గణపురం పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. బుధవారం గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఘణ‌పూర్ ఎస్సై సాంబమూర్తి తెలిపారు. ఘణ‌పురం ఎస్సీ కాలనీకి చెందిన కోయిలా అంబేద్కర్ (20) , పెండ్యాల వెంకటేష్ (20) ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ నుండి గంజాయి తక్కువ ధరకు కొనుక్కొని వచ్చి.. ఇక్కడ ఎక్కువ ధరకు అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారు.

వారిని పాత తహశీల్దార్ కార్యాలయం వద్ద పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. వారి నుండి 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి కోర్ట్ కి తరలించటం జరిగిందన్నారు. ఎవరైనా మండలం లో గంజాయి సరఫరా, విక్రయాలు, సేవించడం వంటి సమాచార తెలిస్తే నేరుగా ఎస్సై నెంబర్ 8712658122 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement