Sunday, May 5, 2024

TS | వాహనాల తనిఖీలో నగదు, బంగారం పట్టివేత.. ఆధారాలు లేకపోవడంతో సీజ్​

తిరుమలగిరి (ప్రభ న్యూస్): ఎన్నికల కోడ్ నేపథ్యంలో బుధవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన బంగారం వ్యాపారి శివకుమార్ తన ఇంటి నుంచి షాపునకు వెళ్తుండగా పోలీసులు అతని బ్యాగును చెక్ చేశారు. దీంతో అతని బ్యాగులో ఎలాంటి పత్రాలు లేని 74,500 నగదు, 10 తులాల బంగారం దొరికింది. వీటి విలువ 5.50లక్షలుగా ఉంటుంది.

ఇక.. 15 కిలోల వెండి విలువ దాదాపు 10.50 లక్షలు ఉంటుంది. మొత్తం 16,74,580 రూపాయల విలువ గల నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని ఫ్లయింగ్ స్కాడ్ బృందం మారయ్య వెంకన్న చైతన్యకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న నగదు, బంగారానికి ఆధారాలు చూపి ఎన్నికల తర్వాత తిరిగి పొందవచ్చునని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement