పోలవరం ప్రాజెక్టు అంచనాలు మళ్లీ పెరిగాయి. ఈ మేరకు ప్రాజెక్టు అంచనాలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు అంచనాలను రూ. 7,192 కోట్లకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో ప్రధాన డ్యామ్ నిర్మాణం కోసం రూ. 5,535 కోట్లుగా రాష్ట్ర జలవనరుల శాఖ నిర్ధారించింది. ప్రధాన డ్యామ్లో భాగమైన ఈసీఆర్ఎఫ్, స్పిల్ వే, పైలట్ ఛానల్ తదితర నిర్మాణాల అంచనాలను మరో రూ.1,657 కోట్ల మేర పెంచుతూ ఉత్వర్వులను జారీ చేసింది. కాగా వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రభుత్వం చెపుతోంది. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు నిధులను విడుదల చేయాలంటూ కేంద్రాన్ని కోరుతోంది. ఇప్పటికే సీఎం జగన్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కేంద్రమంత్రులతో సమావేశమై నిధులను విడుదల చేయాలని కోరారు.
పోలవరం ప్రాజెక్టు అంచనాలు మరో రూ.1,657 కోట్లు పెంపు
By ramesh nalam
- Tags
- andhra pradesh
- Andhra Pradesh government
- breaking news telugu
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- polavaram project
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu trending news
- viral news telugu
Advertisement
తాజా వార్తలు
Advertisement