Sunday, April 28, 2024

Karnataka: మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు నమోదు..

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా సీనియర్‌ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌. యడియూరప్ప పై లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. 17 ఏళ్ల బాలికపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆయనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

నెల రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను భాజపా నేత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. గురువారం సాయంత్రం వాళ్లు పోలీసులను ఆశ్రయించగా.. అర్ధరాత్రి తర్వాత పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలపై యడియూరప్ప, ఆయన కుటుంబసభ్యులు ఇంకా స్పందించలేదు. ఆయన కార్యాలయం వీటిని ఖండించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement