Monday, May 13, 2024

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన..

యాస్‌ తుఫాను ప్రభావిత ప్రధాని మోదీ ఇవాళ పర్యటించనున్నారు. యస్ ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీగా నష్టం జరిగింది. నలుగురు మృతి చెందగా.. 21లక్షల మందికిపై ప్రభావం చూపింది. ఈ క్రమంలో తుఫాను ప్రభావంపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆయా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మొదట ఢిల్లీ నుంచి భువనేశ్వర్‌ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ సమీక్ష జరిపి, బాలాసోర్‌, భద్రక్‌ తదితర ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వేకు వెళ్తారు. ఆ తర్వాత బెంగాల్‌లోని పశ్చిమ మేదీనిపూర్‌ జిల్లాలోని కలైకుండకు చేరుకుంటారు. సీఎం మమతా బెనర్జీ, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మమత, సీఎస్‌ బండియోపాధ్యాయతో కలిసి పూర్బా మేదినీపూర్‌, ఉత్తర, దక్షిణ 24 పరగణాలతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేపట్టనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement