Sunday, April 28, 2024

పూరి జగన్నాథ్ అంటే అసూయ: విజ‌యేంద్ర ప్ర‌సాద్

ప్రముఖ దర్శకుడు, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ భారత చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ, ప్రఖ్యాత స్క్రిప్ట్ రచయితలలో ఒకరు. ఓ ఇంటర్వూలో భాగంగా విజయేంద్ర ప్రసాద్ తన అభిమాన దర్శకుడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ అభిమాన దర్శకుడు ఎవరు ? అని అడిగినప్పుడు… విజయేంద్ర ప్రసాద్ వెంటనే పూరి జగన్నాధ్ అని సమాధానం ఇచ్చారు. “పూరి జగన్నాధ్ నాకు ఇష్టమైన దర్శకుడు. వాస్తవానికి నా ఫోన్ వాల్‌పేపర్ గా పూరి జగన్నాథ్ ఉంటుంది” అంటూ తన ఫోన్ ను చూపించడం విశేషం. పూరీ అంటే నాకు అసూయ‌. నా శత్రువును ప్రతిరోజూ చూడాలని ఆయన ఫొటో నా ఫోన్ లో వాల్ పేపర్ గా పెట్టుకున్నాను” అని నవ్వుతూ చెప్పారు విజ‌యేంద్ర ప్ర‌సాద్.

ప్రస్తుతం ఆయన “ఆర్ఆర్ఆర్” చిత్రానికి స్క్రిప్ట్ రాస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆయన “ఆర్‌ఆర్‌ఆర్” గురించి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని చూశానని, అది చాలా బాగా వచ్చిందని అన్నారు. ఈ చిత్రంలో అలియా భట్ పాత్ర అద్భుతంగా ఉంటుందని, స్క్రీన్ పై ఆమె అందరినీ డామినేట్ చేస్తుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement