Monday, May 6, 2024

TS | ఉప్పల్‌ భగాయత్‌లో అమ్మకానికి ప్లాట్లు.. మూడో దశలో 63 ప్లాట్ల వేలం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నగరం నడిబొడ్డున హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన ఉప్పల్‌ భగాయత్‌ మూడో దశలో ప్లాట్ల అమ్మకాలకు మంగళవారం ప్రి బిడ్‌ సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం 63 ప్లాట్లకు ఆన్‌లైన్‌ వేలం ద్వారా అమ్మకాలు చేయనున్నారు. ఇవన్నీ మల్టి పర్పస్‌ యూస్‌ జోన్‌ కింద ఉన్నట్లుగా అధికారులు తెలిపారు.

323 చదరపు గజాల నుంచి 9,873 చదరపు గజాల వరకు స్థలాలు ఉన్నట్లు హెచ్‌ఎండీఏ సెక్రటరీ చంద్రయ్య వెల్లడించారు. ప్రి బిడ్‌ సమావేశానికి పాల్గొన్న ఔత్సాహిక వేత్తల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. ఈ సమావేశంలో చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ గంగాధర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ హరికృష్ణ పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement