Sunday, April 28, 2024

PLGA Celebrations – ఘ‌నంగా మావోయిస్ట్ పార్టీ పి ఎల్ జి ఏ వారోత్సవాలు…

బీజాపూర్ -సుక్మా సరిహద్దుల్లో ఘ‌నంగా మావోయిస్టుల ఆధ్వ‌ర్యంలో పి ఎల్ జి ఏ వారోత్సవాలు నిర్వ‌హించారు..ఈ వారోత్స‌వాల‌లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు,వివిధ గ్రామాల‌కు చెందిన ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.. దీనిలో భాగంగా పార్టీలోకి పెద్ద సంఖ్య‌లో స‌భ్యుల‌ను చేర్చుకున్నారు.. ముఖ్యంగా గిరిజ‌న యువ‌త పెద్ద సంఖ్య‌లో పాల్గొవ‌డం విశేషం..

ఈ వారోత్స‌వాల‌లో పాలస్తీనాకు మద్దతుగా భారత్, అమెరికా సహా మూడు దేశాల ప్రధాన మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి వారికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు..

ఇక గత 11 నెలల్లో తమ సంస్థ పొలిట్‌బ్యూరో సభ్యుడు క‌ట‌కం సుదర్శన్‌తో సహా మొత్తం 54 మంది నక్సలైట్‌లు హతమయ్యారు వారికి ఈ వారోత్స‌వాల‌లో ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.. ఈ హత్య గురైన మావోయిస్టుల జ్ఞాపకార్థం, శిలా ఫ‌ల‌కాల‌ను అవిష్క‌రించారు..ఈ వారోత్స‌వాల ఫోట‌ల‌ను,వీడియోల‌ను మావోయిస్టుల విడుద‌ల చేశారు.. ఈ వారోత్స‌వాల‌లో 16 మంది మ‌హిళ‌లు పాల్గొవ‌డం విశేషం

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement