Thursday, May 2, 2024

AP: శ్రీ సత్యసాయి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత..

శ్రీ సత్యసాయి బ్యూరో, డిసెంబర్ 13 (ప్రభ న్యూస్) : శ్రీ సత్యసాయి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఇవాళ కొడికొండ చెక్‌పోస్టు వద్ద కంటైనర్‌లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్ గంజాయితో హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళుతున్నట్లు గుర్తించారు.


గంజాయి తరలిస్తున్న కంటైనర్‌ను వీడియోలు తీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. గంజాయి తరలింపునకు సంబంధించి వివరాలను కూడా పోలీసులు వెల్లడించలేదు. అయితే ఉన్నతాధికారులే వివరాలు వెల్లడిస్తారని పోలీసులు చెబుతున్నారు. కంటైనర్ సమీపంలోకి మీడియా వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement