Sunday, April 28, 2024

RTC బస్ ఎక్కిన రవాణా మంత్రి .. ఉచిత ప్ర‌యాణంపై పొన్నం మాటా మంతి..

క‌రీంన‌గ‌ర్ – సిద్దిపేట నుండి కరీంనగర్ కు వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో ఆగి ఆర్ టి సి బస్సు ఎక్కి ప్రయాణికులతో ముచ్చటించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉచిత బస్సు ప్రయాణం ఎలాఉందని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ప్రయాణికులు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ప్రయాణం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సళ్ళగ్గ ఉండాలి బిడ్డ అని దీవించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఆర్టీసీని గాలికి వదిలేసింద‌ని, ఆర్టీసీని బలోపేతం చేస్తామ‌ని అన్నారు..
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు స్వేచ్ఛగా తమ సమస్యలను విన్నవించుకోవచ్చ‌ని అంటూ ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహరించాల‌ని కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement