Thursday, April 25, 2024

ఫొటో మార్ఫింగ్‌.. మైనర్‌ బాలికకు జిమ్‌ ట్రైనర్‌ వేధింపులు..

అమ్మాయిలు సోషల్‌ మీడియాలో పెట్టిన ఫొటోలు, వాట్సాప్‌ డీపీ ఫొటోలు తీసుకుని వాటిని మార్ఫింగ్‌ చేసి కొంతమంది దుండగులు బెదిరింపులకు దిగుతున్నారు. కొందరు డబ్బు కోసమైతే.. మరికొందరు తమ కోరిక తీర్చాలని అమ్మాయిలను వేధిస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా హైదారాబాద్‌లోని బోయిన్‌పల్లిలో వెలుగులోకి వచ్చింది. జిమ్‌సెంటర్‌లో ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ రాజు మైనర్‌ బాలిక ఫొటోలు మార్ఫింగ్‌ చేసి వేధింపులకు దిగాడు. తన వద్దకు జిమ్‌ చేసేందుకు వచ్చిన మైనర్‌ బాలిక ఫొటోలు తీసుకుని మార్ఫింగ్‌ చేశాడు. బంగారం, నగదు కావాలని బాలికను బెదిరించాడు. లేదంటే ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని వేధించాడు. దీంతో భయపడి ఇంట్లోని 20 తులాల బంగారం, రూ.4 లక్షల నగదును జిమ్‌ ట్రైనర్‌ రాజుకు ఇచ్చింది. అక్కడితో ఆగకుండా మళ్లిd వేధించడం మొదలుపెట్టడంతో ఒత్తడి తట్టుకోలేక బాలిక పోలీసులను ఆశ్రయించింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు జిమ్‌ ట్రైనర్‌ రాజును అదుపులోకి తీసుకుని.. నిందుతుడిపై కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement