Friday, April 26, 2024

బయ్యారంలో స్టీల్ ప్లాంట్….జిందాల్ కు కెటిఆర్ ఆహ్వానం….

తెలంగాణ పాలసీలపై అవగాహన ఉంది
పెట్టుబడుల ఆకర్షణలో భేష్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిందాల్‌ ప్రశంసలు
టాటా గ్రూపు, హెచ్‌యూఎల్‌ కంపెనీల యాజమాన్యాలతోనూ ముంబైలో మంత్రి కేటీఆర్‌ భేటీ
వరంగల్‌కు టీసీఎస్‌ కంపెనీని విస్తరించాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముంబైలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు. తెలంగాణలో ఇప్పటికే ఉన్న కంపెనీల కార్యకలాపాలు విస్తరించాలని, కొత్త పెట్టుబడులు పెట్టాలని టాటా గ్రూపు, జేఎస్‌ డబ్ల్యూ, హిందుస్థాన్‌ లీవర్‌ లిమిటెడ్‌ వంటి ప్రతిష్టాత్మక కంపెనీల యాజమాన్యాలను కోరారు. ప్రముఖ పారిశ్రామిక సంస్థ జేయస్‌ డబ్ల్యు గ్రూపు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సజ్జన్‌ జిందాల్‌తో ముంబైలోని ఆ సంస్థ కేంద్ర కార్యాల యంలో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. జేఎస్‌డబ్ల్యూ సంస్థకు స్టీల్‌, సిమెంట్‌ వంటి రంగాల్లో ఉన్న అపార విజయవంతమైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని జిందాల్‌ను కేటీఆర్‌ కోరారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నప్పుడు బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని అక్కడ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు సెయిల్‌ సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తుచేశారు. బయ్యారంతో పాటు పక్కనే ఉన్న చత్తీస్‌ ఘడ్‌ లో ఉన్న ఇనుప ఖనిజం నిల్వలను దృష్టిలో ఉంచు కొని అక్కడ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని కేటీఆర్‌ వివ రించారు. జేఎస్‌డబ్ల్యూ వంటి ప్రతిష్టాత్మక సంస్థ బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకువస్తే, అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. జిందాల్‌ గ్రూప్‌ కార్య కలా పాలు నిర్వహస్తున్న విద్య, క్రీడారంగం వంటి ఇతర రంగాల్లోనూ పెట్టుబ డులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని జిందాల్‌ ని కేటీఆర్‌ కోరారు. తెలంగాణ ప్రభుత్వం పాలసీల గురించి తమకు అవగాహన ఉన్నదన్న సజ్జన్‌ జిందాల్‌, కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతి, పెట్టుబడుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయక త్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.

తొలుత టాటా గ్రూప్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో టాటా కార్పోరేట్‌ కేంద్ర కార్యాలయం బాంబే #హౌస్‌ కేటీఆర్‌ సమావేశమై వివిధ వ్యాపార వాణిజ్య అవకాశాల పై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగు తున్న పారిశ్రామిక అభివృద్ధి, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న అత్యుత్తమ పారిశ్రామిక విధానాలపై మాట్లాడిన కేటీఆర్‌, తెలంగాణ రాష్ట్రంలో టాటా గ్రూపు కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఉన్న అవకాశాలను ఆయా రంగాల వారీగా వివరించారు. తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూల పరిస్థి తులు, అవకాశాలను దృష్టిలో ఉంచుకొని టాటా గ్రూపు వివిధ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. టాటా గ్రూపు వివిధ రంగాల్లో చేపట్టనున్న విస్తరణ ప్రణాళికలో తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా చంద్రశేఖరన్‌ను కేటీఆర్‌ కోరారు. ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగంలో #హదరాబాద్‌ కేంద్రంగా టాటా గ్రూప్‌ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని తెలిపిన కేటీఆర్‌, టీసీఎస్‌ కార్యకలాపాలను వరంగల్‌కు విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో భారీ ప్రణాళికలతో టాటా గ్రూప్‌ ముందుకు పోతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్స్‌ పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని కేటీఆర్‌ వివరించారు. ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. విమానయాన రంగంలో టాటా సంస్థ మంచి పురోగతి సాగిస్తున్న నేపథ్య ంలో… హైదరాబాదులో ఒక విమానాల ఎమ్మార్వో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ కోరారు.

- Advertisement -

ఎఫ్‌ఎమ్‌సీజీ రంగంలో పెట్టుబడులు పెట్టండి…
హిందుస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌(హెచ్‌యూఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ మె#హతాతో సమావేశమైన కేటీఆర్‌, తెలంగాణ రాష్ట్రంలో ఫాస్ట్‌ మూ వింగ్‌ కన్సూమర్‌ గూడ్స్‌(ఎఫ్‌ఎమ్‌సీజీ) రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశా లను వివరించారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంతో పాటు అనేక ఇతర ఆర్థిక సూచీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఆయా రంగాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిన నేపథ్యంలో తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకునేందుకు ఇదే సరైన అవకాశమని కేటీఆర్‌ తెలిపారు. ఈ రంగంలో ఇతర సంస్థలు పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. పామ్‌ ఆయిల్‌ ఉత్పత్తి కోసం ఒక బహత్తర లక్ష్యాన్ని ఎంచు కున్న తెలంగాణ ప్రభుత్వం, ఆ దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్స#హ స్తోందని తెలిపారు. వంట నూనెల ఉత్పత్తి కోసం హందుస్థాన్‌ యూనిలీవర్‌ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమన్నారు కేటీఆర్‌. ఆ తరువాత ఆర్‌ పి జి గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనంత్‌ గోయంకా తోనూ మంత్రి కేటీఆర్‌ సమావేశమై, పెట్టుబడులు, రాష్ట్ర ప్రగతిపై చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement