Thursday, May 2, 2024

మద్యం మత్తులో ఇంటి యజమానికి చంపిన యువకుడు..

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని కలివీధిలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి యజమాని మందలించాడని మద్యం మత్తులో కొట్టి చంపాడు యువకుడు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఓబులేసు ఇంట్లో రాజశేఖర్‌ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. ఆ యువకుడు మద్యం తాగి వచ్చి గొడవకు దిగాడు. దీంతో గొడవలు వద్దంటూ ఆ ఇంటి యజమాని రాజశేఖర్‌ను మందలించాడు. దీంతో ఆగ్రహంతో మద్యం మత్తులో ఓబులేసుపై దాడికి దిగాడు. తీవ్రగాయాలైన ఓబులేసు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement